Thursday, July 5, 2012

edu news



ఎడ్యు న్యూస్
మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్
కేంద్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు అందజేయనున్న వివిధ రకాల స్కాలర్‌షిప్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేటగిరీలు..
ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15, 2012.

ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో టెక్నికల్ కోర్సులు (ఐటీఐ సహా) 11వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందజేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు: మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ అందజేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2012.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
వివరాలకు: www.apsmfc.com
www.minorityaffairs.gov.in

డీఎస్సీకి పాత షెడ్యూల్ ప్రకారమే ఫీజు చెల్లింపు
రాష్ట్రంలో 21,363 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్విహ ంచే డీఎస్సీ-2012 రాత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు పాత షెడ్యూలు ప్రకారమే జూలై 12వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో 13వ తేదీలోగా సమర్పించాలి.

రాత పరీక్షలను ఆగస్టు 26, 27, 28 తేదీల్లో నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబర్ 28న విడుదల చేస్తారు. డీఎస్సీ రాత పరీక్షకు హాజరయ్యేందుకు ఇప్పటికే 2,29,832 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. టెట్‌లో అర్హత పొందిన వారి నుంచి మరో 2 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

మ్యాట్-2012
ఎంబీఏ సంబంధిత కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)-2012కు ప్రకటన వెలువడింది.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగస్టు 13, 2012
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 2, 2012
వెబ్‌సైట్: www.aima-ind.org

No comments:

Post a Comment